News

ఉరేసుకుని చస్తాం కాని..


మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు న్యాయం చేయకపోతే ఉరేసుకుని చస్తాం కాని..మాట తప్పబోమని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యతిరేక పార్టీ, తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే పార్టీలు కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిపై అక్కసుతోనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పట్లో రైతుల ఆత్మహత్యలకు కారణమైన పార్టీలు ఇప్పుడు రైతు పాదయాత్రలు చేయడం సిగ్గు చేటన్నారు. ప్రతిపక్షాలు రైతుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు.